BPT: యద్దనపూడి మండలంలో శనగల కొనుగోలు కోసం 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు బుధవారం వ్యవసాయాధికారి (AO) కుమారి తెలిపారు. అనంతవరం, యద్దనపూడి, జాగర్లమూడి, పూనూరు కేంద్రాల్లో రైతులు తమ పంటను విక్రయించుకోవచ్చని చెప్పారు. ఈ-పంట, సీఎం యాప్లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ మద్దతు ధర వర్తిస్తుందని, పంటలో తేమ శాతం 14 లోపు ఉండాలని ఆమె సూచించారు.