SRPT: మఠంపల్లిలో నూతనంగా ఎన్నికైన వార్డ్ సభ్యులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. ఇంఛార్జ్ ఎంపీడీవో లావణ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణలో పంచాయితీ కార్యదర్శులు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమం గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేదని, ఇది తమకు ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చని వార్డు సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.