KMM: వైరా మండలం విప్పలమడక రైతు వేదిక ఆవరణలో ప్రభుత్వ చెట్టుకు చెందిన చింతకాయలు దొంగిలించబడిన ఘటన పోలీస్ స్టేషన్కు చేరింది. మంగళవారం గ్రామ పంచాయతీ గుమస్తా ఎస్సై పవన్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తిని తస్కరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.