అన్నమయ్య: కొత్తపల్లి గ్రామంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే మల్లూరమ్మ తల్లి జాతరకు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని టీడీపీ నాయకులు, ఆలయ ధర్మకర్తలు ఆహ్వానించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి, ట్రాఫిక్ సమస్యలు లేకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో అమ్మవారి జాతరల్లో ఈ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉందని నాయకులు తెలిపారు.