W.G: ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి శాంతి ధామాన్ని మూసివేస్తున్నట్లు అఖిల భారత పెనుగొండ వాసవి ట్రస్ట్ ఛైర్మన్ గోవిందరాజులు తెలిపారు. గ్రహణం కారణంగా ఆలయ ద్వారాలు మూసి ఉంచుతామని, బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు అమ్మవారి పునర్దర్శనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.