TG: రాష్ట్రంలో 2027 గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి నది మహా పుష్కరాలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి భక్తులు పుణ్యస్నానాలకు ఘాట్ నిర్మాణం, రోడ్ల విస్తరణ, లైటింగ్, పార్కింగ్, ఇతర ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.