ATP: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. 5వ తరగతి పరీక్షకు 6,457 మంది, జనరల్ ఇంటర్కు 3,528 మంది, ఐఐటీ/నీట్ పరీక్షకు 2,374 మంది విద్యార్థులు హాజరయ్యారని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి కె.జయలక్ష్మి తెలిపారు.