AP: అన్నమయ్య జిల్లా బి.కొత్తపేట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ పరిధిలోని అడవుల్లో మంటలు వ్యాపించాయి. సెరికల్చర్ ఫాం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు నిన్న నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. రాత్రి వరకు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైందని స్థానికులు తెలిపారు. ఈ మంటల్లో కొన్ని జంతువులు కాలిపోతున్నాయని వెల్లడించారు. ఫాం వద్ద మంటలు ఆర్పివేశామని అటవిశాఖ అధికారి చెప్పారు.