NRPT: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఊట్కూర్ ఖండలో నిర్వహించనున్న ఖండ శాఖల సంగమాన్ని విజయవంతం చేయాలని ఖండ సంఘచాలక్ శ్రీ రాంరెడ్డి కోరారు. ఖండ పరిధిలోని 56 గ్రామాలకు చెందిన స్వయం సేవకులు ఉదయం 7 గంటలకు జాజాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఒకే వేదికపై సమావేశమవుతారని తెలిపారు.