అన్నమయ్య: మాదకద్రవ్యాల వినియోగంపై ‘జీరో టోలరెన్స్’తో వ్యవహరించాలని, డ్రోన్లతో నిఘా పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ ధీరజ్తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో, పాఠశాలల వద్ద నికోటిన్ పదార్థాల విక్రయాలను అరికట్టాలని సూచించారు.