ప్రకాశం: తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు శుక్రవారం ఒంగోలు సమీపంలోని భగీరథ పాలిమర్స్ పరిశ్రమను సందర్శించారు. భారత ప్రభుత్వ సంస్థ BIS ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎక్స్పోజర్ విజిట్లో విద్యార్థులు నీటి సరఫరాకు ఉపయోగించే HDPE పైపుల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.