TPT: ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామంలో గురువారం రక్తదాన శిబిరం ఉత్సాహంగా నిర్వహించారు. డా. గంగలపూడి గిరిధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ శిబిరంలో తిరుపతి రక్షణ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు రక్తాన్ని సేకరించారు. గ్రామానికి చెందిన సుమారు 35 మంది యువకులు, పెద్దలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.