ATP: గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారానికి చెందిన నిరుపేద నంచర్ల రాము కుమార్తె ఉమ వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేశారు. శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన, బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, సుందరయ్య, తదితరులు పాల్గొన్నారు.