ATP: శింగనమల నియోజకవర్గం నాయనపల్లి క్రాస్ రైతులు సంప్రదాయ పంటల్లో లాభాలు లేక చామంతి సాగు చేపట్టారు. విద్యుత్ బల్బుల వెలుగులో దిగుబడులు పెంచి ఆకర్షణీయమైన పూలను పండిస్తున్నారు. వీటిని బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. పంట బాగున్నా ధర లభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.