GNTR: జిల్లాలో ‘అక్షర ఆంధ్రా’ కార్యక్రమం కింద అభ్యర్థులందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బుధవారం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జిల్లాలో 90,426 మంది అభ్యాసకులు నమోదు చేసుకోగా, 9,043 మంది వాలంటీర్లు వీరికి విద్యాబోధన చేస్తున్నారని వివరించారు.