CTR: ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా తక్కువ సమయంలో అధిక లాభాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. అనుమానాస్పద గ్రూపులు, యాప్ల నుంచి దూరంగా ఉండాలని, మోసానికి గురైతే 1930 హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వలన్నారు.