VKB: పరిగిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర బుధవారం 1.50 కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరు నిందితులు నితీశ్ రఝాక్(22), సూరజ్ కుమార్ (22)ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ నుంచి గంజాయిని పరిగికి తీసుకువచ్చి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న లేబర్లకు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.