JGL: రాయికల్ మండలంలోని భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో IMA ఆధ్వర్యంలో బాలికలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. 115 మంది బాలికలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి అనీమియాతో బాధపడుతున్న 73 మంది బాలికలకు నెలకు సరిపడా మందులు, సానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు హేమంత్, శ్రీనివాసరెడ్డి, అచ్యుత్, సాహితీ, సర్పంచ్ భావన పాల్గొన్నారు.