ELR: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పోటీతత్వంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి అర్జీని చాలెంజీగా తీసుకుని నిర్ణీత సమయంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అలాగే ఈరోజు జరిగిన పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్లలో 257 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు.