KMM: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య నగరంలోని అల్లిపురం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ (UGD) పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత, మన్నిక విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.