SRPT: నడిగూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ నిధులతో ప్రీ-ప్రైమరీ విభాగం సరికొత్తగా ముస్తాబవుతోంది. చిన్నారులను ఆకట్టుకునేలా తరగతి గది గోడలపై అక్షరాలు, అంకెలు, పక్షులు, జంతువుల చిత్రాలను ఆకర్షణీయంగా చిత్రీకరిస్తున్నారు. ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతాయని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.