కోనసీమ: కాట్రేనికోన మండలం చెయ్యేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేబ్రేక్ అనిమల్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన శుద్ధి నీటి ప్లాంట్ను ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన తాగునీరు అందించడం అత్యంత ముఖ్యమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తాయన్నారు.