KDP: సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం డీఎంహెచ్వో కార్యాలయ డిప్యూటీ డెమో ఆఫీసర్ ప్రసన్న లత విద్యార్ధినీలకు టీనేజ్ ప్రెగ్నెన్సీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల తక్కువ బరువు గల శిశువులకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. టీనేజ్ పిల్లల ముందు తల్లిదండ్రులు కొన్ని అలవాట్లు మానుకోవాలని తెలిపారు.