కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులో సోమవారం సాయంత్రం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను, వినతులను నేరుగా తెలియజేసి పరిష్కారం పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.