VZM: గజపతినగరం మండలంలోని లోగిస గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో 114 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, కాలువలు నిర్మించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గోపాల రాజు పాల్గొన్నారు.