విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకల సందడి మొదలైపోయింది. రాజస్థాన్లోని ఉదయపూర్లో ఫిబ్రవరి 26న వారి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు ఉదయపూర్ చేరుకుంటున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా జంటగా ఉదయపూర్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతోంది.