పల్నాడు జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన గర్భిణీలకు సకాలంలో వైద్య సేవలు అందించకపోతే సంబంధిత వైద్యులకు నోటీసులు ఇవ్వాలని జేసీ సంజనా సింహ ఆదేశించారు. నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ రక్తం అందించడంలో జరిగిన పొరపాటుపై వివరాలు తెలుసుకున్నారు.