W.G: అత్తిలి ఎస్సైగా కె.ఎన్.విశ్వనాధ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కూచిపూడి పోలీసు స్టేషన్లో ఎస్సైగా పని చేసిన ఆయన అత్తిలికి బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు అత్తిలి ఎస్సైగా వ్యవహరించిన పి.ప్రేమరాజు భీమవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. శాంతిభద్రతలు కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.