ATP: కుందుర్పి మండలం ఎన్.వెంకటాంపల్లి ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య నెలకొంది. నీటి సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి ఫిల్టర్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.