ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం సమీపంలో శనివారం ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. దీంతో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే రేషన్ కుమార్ వెంటనే స్పందించి హుటాహుటిన సంఘటన స్థలంలో దిగి క్షతగాత్రులకు ధైర్యం చెప్పి వారిని ఆసుపత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టారు.