GNTR: నిడుబ్రోలు 11వ వార్డు రామ మందిరం ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నేత జాగర్లమూడి నాగేశ్వరావు సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాగేశ్వరావు మృతికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కూటమి నేతలు, శ్రేణులు సంతాపం తెలిపారు. అంతిమ కార్యక్రమం మంగళవారం ఉదయం నిర్వహించనున్నారు.