HNK: ఐనవోలు మండలం పున్నేలు శివారులోని స్విమ్మింగ్ పూల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఫరహన ఆమె ఇద్దరు కుమార్తెలు మృతి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, డీసీపీ అంకిత్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్విమ్మింగ్ పూల్ పరిసరాలు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల వ్యవస్థను అధికారులు సమీక్షించారు.