HNK: భీమారంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభను ఏర్పాటు చేశారు. వార్డు సభకు స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రగతి ప్రణాళికలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు సూచించారు. అనంతరం ప్రజల వద్ద నుంచి పలు వినతులను స్వీకరించారు.