WGL: నగరంలోని కాశీబుగ్గలో గల శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ గురువారం ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో నిర్వహించిన 108 హనుమాన్ చాలీసా మహా పారాయణంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పఠించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరారు.