GDWL: పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షుడు గడ్డం భరత్ బాబు జోగులాంబ గద్వాల పాత బస్టాండ్ వద్ద ఈనెల 30న బీఆర్ఎస్వీ పోరు దీక్ష విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్మెంట్ అమలులో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ దీక్ష చేపడతామని పేర్కొన్నారు. విద్యార్థులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.