ATP: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ఆవశ్యకతపై అనంతపురంలో వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సు ఇవాళ జరిగింది. జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాముఖ్యత, హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు వల్ల కలిగే ప్రయోజనాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.