అన్నమయ్య: మదనపల్లి సమీపంలోని కలిచెర్ల గ్రామంలో జలజీవన్ మిషన్ కింద నిర్మాణంలో ఉన్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. రూ.2370 కోట్ల వ్యయంతో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా గండికోట రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని పీలేరు, రాయచోటి ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.