కామారెడ్డి జిల్లా నర్సంపల్లిలో కుల వివక్ష నిర్మూలన లక్ష్యంగా సమగ్ర సామాజిక సమానత్వ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేవాలయాల్లో దళితులకు ప్రవేశం కల్పించడం, సహపంక్తి భోజనాలు నిర్వహించడం ద్వారా సమానత్వానికి బలమైన సందేశం ఇచ్చారు.