ATP: గుంతకల్లలోని పొట్టి శ్రీరాములు సర్కిల్లో IFTU ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని నాయకులు రఘునాథ్ రెడ్డి, రామదాసు డిమాండ్ చేశారు. 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ,కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.