TG: రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పారాక్వాట్ అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల పాటు నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.