HNK: జిల్లాలోని ఐదుగురు దివ్యాంగులకు WGL పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాంకేతికత దివ్యాంగుల సాధికారతకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు.