BDK: చండ్రుగొండ మండలం తుంగారం పంచాయతీలో ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. కొంతమంది ప్రభావశీలుల అండతో నిర్మాణాలు కూడా సాగుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులపై స్పందన లేకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. అధికారులు తక్షణమే సర్వే నిర్వహించి భూములను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.