SRPT: కోదాడ పట్టణంలో వ్యాధుల నివారణకు మున్సిపల్ యంత్రాంగం నడుము బిగించింది. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ ప్రారంభించారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా అన్ని వార్డుల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.