HNK: ఐనవోలు మండలంలోని పంథిని పశువైద్యశాలలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. పాడి రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని ఎమ్మెల్యే అన్నారు.