MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ మున్సిపల్ పార్కును కమిషనర్ రామానుజులు రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కులో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అనంతరం పార్క్ను సందర్శించి మున్సిపల్ సిబ్బందికి తగు సూచనలు చేసినట్టు వివరించారు.