KNR: గంగాధర మండలం నాగిరెడ్డిపూర్లో సోమవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహాసీల్దార్ కళావతి మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిషేధించబడిందని, సమాజంలో అందరూ సమానమేనని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసి మెలిసి జీవించాలని ఆమె సూచించారు.