KMM: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజీవాల్ పై తప్పుడు కేసులు బీజేపీ కుట్రేనని ఆమ్ ఆద్మీ పార్టీ పాలేరు ఇన్ఛార్జ్ పసుమర్తి శ్రీనివాస్ అన్నారు. శనివారం నేలకొండపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రివాల్ పై న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చినా బీజేపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఇకనైనా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.