ADB: మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని బెల్లూరు కాలనీలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోకో పిట్ యూనిట్ను మున్సిపల్ ఛైర్పర్సన్ అనూషతో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడీ రాజు తదితరులు ఉన్నారు.