KMM: కామేపల్లి మండలం ముచ్చర్లలో అడవి పంది మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముచ్చర్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు 8 కిలోల మాంసాన్ని కొనుగోలు చేసి పంచుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శిల్ప, బీట్ ఆఫీసర్ నాగరాజు సోమవారం తెలిపారు.