ADB: సబ్సిడీ పథకాలతో యువతకు ఉపాధి లభిస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. మండలంలోని పిప్పలదరి గ్రామానికి చెందిన కుమ్ర జాదవ్ రావు అనే ఆదివాసీ యువకుడికి ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా మంజూరైన బొలెరో వాహనాన్ని బుధవారం అందజేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.